లోకసభ ఎన్నికల సందర్భంగా మూతబడనున్న మద్యం దుకాణాలు
హైదరాబాద్ మే 9 (హిం.స) రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు మధ్యం దుకాణాలు మూతపడనున
లోకసభ ఎన్నికల సందర్భంగా మూతబడనున్న మద్యం దుకాణాలు


హైదరాబాద్ మే 9 (హిం.స)

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు మధ్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావు ఉండకూడదని.... ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 48 గంటల పాటు రాష్ట్రంలో డ్రై డ్రేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల (మే) 11న (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి మే 13న (సోమవారం) సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపులతో పాటు రాష్ట్రంలోని అన్ని కల్లు కాంపౌండ్లు కూడా మూత పడనున్నాయి. అలాగే ఎన్నికల ఫలితాల రోజైన జూన్ 4న వైన్ షాపులు మూతపడనున్నాయి.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande