నందికొట్కూరు, 09 మే (హిం.స): ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజు కూలీలకు.. నాయకులు నకిలీ నోట్లు పంపిణీ చేసిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో బుధవారం వెలుగుచూసింది. ‘ఓ ప్రధాన పార్టీ నాయకులు రూ. 200 కూలి ఇస్తామంటే ప్రచారానికి వెళ్లాం. ప్రచారం ముగిశాక వారు రూ.100 నోట్లు ఇచ్చారు. ఇంటికెళ్లి చూసుకోగా అవి దొంగనోట్లని తేలింది. డబ్బులిచ్చిన నాయకుడిని అడిగితే తాము అసలు నోట్లే ఇచ్చామని గద్దించి మాట్లాడుతున్నారు’ అని ప్రచారంలో పాల్గొన్న కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి నకిలీ నోట్లని తెలియక దుకాణాల్లో ఇవ్వగా వారు తమను తిట్టి పంపుతున్నారని మరికొందరు వాపోయారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్