తెలంగాణ, ఆసిఫాబాద్. 11 జూన్ (హి.స.)
ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు.
బుధవారం జిల్లాలోని వాంకిడి మండలం అర్లి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు సందర్శించి అర్జీదారుల సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం భూ భారతి నూతన ఆర్ఆర్ చట్టం అమలుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని అన్నారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తు లు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు