ప్రత్యేక ఆర్ధిక.మండలి సెజ్ లో మరో.భారీ.పరిశ్రమ
రాంబిల్లి, 11 జూన్ (హి.స.) , : ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగు పడింది. సెజ్‌ రెండో విడత కోసం రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో సేకరించిన భూముల్లో కలప ప్యానెళ్లను తయారుచేసే బాలాజీ యాక్షన్‌ తెసా కంపెనీ ఏర్పాటు కానుంది. కర్
ప్రత్యేక ఆర్ధిక.మండలి సెజ్ లో మరో.భారీ.పరిశ్రమ


రాంబిల్లి, 11 జూన్ (హి.స.)

, : ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగు పడింది. సెజ్‌ రెండో విడత కోసం రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో సేకరించిన భూముల్లో కలప ప్యానెళ్లను తయారుచేసే బాలాజీ యాక్షన్‌ తెసా కంపెనీ ఏర్పాటు కానుంది. కర్మాగారం నిర్మాణ పనులకు మంగళవారం కంపెనీ ఛైర్మన్‌ ఎన్‌.కె.అగర్వాల్, ఎండీ వివేక్‌జైన్, కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎమ్మెల్యే విజయకుమార్‌ భూమి పూజ నిర్వహించారు. ఈ కంపెనీకి 105.70 ఎకరాలు కేటాయించారు. రూ .200 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ ఎండీఎఫ్, హెచ్‌డీఫ్‌ పార్టికల్‌ బోర్డులతోపాటు హెచ్‌డీఎఫ్‌ లామినేట్‌ చెక్క ఫ్లోరింగ్‌ వంటి వినూత్న ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందినది. కంపెనీ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి కలగనుంది. సకాలంలో నిర్మాణం పూర్తిచేసి నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే విజయకుమార్‌ కంపెనీ ప్రతినిధులను కోరారు. భూమి పూజ సందర్భంగా కంపెనీ ఛైర్మన్‌ ఎన్‌.కె.అగర్వాల్, ఎండీ వివేక్‌జైన్‌ ఎమ్మెల్యే విజయకుమార్‌ను సత్కరించారు. ఆర్డీఓ ఆయిషా, ఏపీఐఐసీ డీజెడ్‌ఎం సూర్యనారాయణ, సర్పంచి సత్తిబాబు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande