అమరావతి, 11 జూన్ (హి.స.)
బుక్కరాయసముద్రం: మెగా జాబ్ మేళాకి విశేష స్పందన లభించిందని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గురుకుల పాఠశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రావణి పాల్గొని.. ఇంటర్వ్యూలో ఎంపికైన యువతకు ఆఫర్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లు రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయేలా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి దిశగా పెట్టుబడి పెట్టే కంపెనీలు వస్తున్నాయి. వచ్చే నెలలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తాం. జాబ్ రాలేదని యువత నిరుత్సాహ పడకుండా ఒక కంపెనీలో ఉద్యోగం రాకపోతే మరో కంపెనీలో ప్రయత్నించి ఉద్యోగం సాధించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ