అమరావతి, 11 జూన్ (హి.స.)
రాజంపేట గ్రామీణ, : దిల్లీ వెళ్లేందుకు ఎక్కాల్సిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు ఇప్పటి వరకు రాజంపేట రైల్వే స్టేషన్లో ఆగేది కాదు. దీంతో ప్రయాణికులు వ్యయప్రయాసలకోర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. రాజంపేటలో నిలపాలని గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ప్రజా ప్రతినిధులు విన్నవించినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ప్రజాప్రతినిధులు ఆ దిశగా మళ్లీ ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు బుధవారం నుంచి రాజంపేట స్టేషన్లో రైలు నిలిపేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ