మళ్లీ ఊపందుకున్న నైరుతి.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!
అమరావతి, 11 జూన్ (హి.స.)వాయువ్య ఉత్తరప్రదేశ్ దాని పరిసరాల నుంచి మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌ఘడ్, మధ్య ఒడిస్సా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుం
మళ్లీ ఊపందుకున్న నైరుతి.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!


అమరావతి, 11 జూన్ (హి.స.)వాయువ్య ఉత్తరప్రదేశ్ దాని పరిసరాల నుంచి మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌ఘడ్, మధ్య ఒడిస్సా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో గాలి విచ్ఛిత్తిగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

అటు ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు మాడు పగిలే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలోనూ పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నేడు పలు జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటనున్నాయి. నిన్న వేమవరంలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. మన్యం జిల్లా సాలూరులో 43మి.మీ వర్షపాతం నమోదైంది. వాయువ్య ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళావాడం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ చత్తీస్‌ఘఢ్, మధ్యం మీదుగా సగటు సముద్ర మట్టానికి 9 కి.మీ ఎత్తురో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రధానంతో రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande