న్యూఢిల్లీ, 14 జూన్ (హి.స.), : ఆధార్ అప్డేట్ చేసుకునే వారికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు జూన్ 14వ తేదీతో.. అంటే నేటితో ముగియనుంది. అలాంటి వేళ ఉడాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా శనివారం వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు