అమరావతి, 14 జూన్ (హి.స.)
విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కొత్త కార్యనిర్వాహక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్)ని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య రంగానికి చెందిన 8 మంది నిపుణులకు ఈ మండలిలో చోటు కల్పించింది. వీరితో పాటు మరో ఐదుగురు కార్యనిర్వాహక మండలిలో ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్ఛైర్మన్ ఈ మండలికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వైద్యవిద్య డైరెక్టర్, ఆయుష్ విభాగం డైరెక్టర్ ఇతర సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ