అమరావతి, 14 జూన్ (హి.స.)
మారేడుమిల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పాములేరు వాగులో ఇద్దరు పర్యాటకులు గల్లంతయ్యారు. విజయవాడ నుంచి ఆరుగురు మిత్రుల బృందం మారేడుమిల్లి సమీపంలో పాములేరు వాగు వద్దకు చేరుకుని భోజనానంతరం స్నానాలకు దిగారు. వీరిలో కటకం రవితేజ (30), సాధిష్ (23) గల్లంతయ్యారు. మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ సహాయక చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ