అమరావతి, 16 జూన్ (హి.స.)
విశాఖపట్నం (వన్టౌన్), : ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11.40కి విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్రోడ్డుకు వెళ్లి, యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్ హోటల్కు వెళ్లి, అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ సెంటర్లో తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. రాత్రికల్లా విజయవాడకు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ