అనంతపురం, 16 జూన్ (హి.స.)
, :వ్యాపారం పేరుతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దంపతులు ఘరానా మోసానికి తెరదీశారు. మధు గ్రూప్స్ పేరుతో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారమని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టారు. వారి మాటలను నమ్మి అనంతపురానికి చెందిన ఓ కుటుంబం రూ.కోటికి పైగా పెట్టుబడి పెట్టింది. లాభాలు చూపకపోవడంతోపాటు ఇచ్చిన డబ్బు కూడా చెల్లించకపోవడంతో బాధిత కుటుంబం రైల్వే కోడూరులో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అండదండలతో కేసులు లేకుండా చేసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన ఓ ఎంపీ అండదండలున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బాధితులు అనంతపురం టూటౌన్లో ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఈ నెల 14న అనంతపురం టూటౌన్ పోలీసులు.. చింతా మధురవాణి, చింతా రామసుబ్బారెడ్డి అలియాస్ మన్నూరు రమణయ్య దంపతులను అరెస్టు చేశారు. వీరి బాధితులు కడప జిల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ