హైదరాబాద్, 21 జూన్ (హి.స.)దిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై (Iran-Israel War) భారత్ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తప్పుబట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మౌనం దౌత్య వైఫల్యంలా కన్పిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి భారత దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందని అన్నారు. టెహ్రాన్పై, టెల్ అవీవ్ చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమైనవిగా.. సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల వల్ల ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని సోనియా పేర్కొన్నారు. ఈ ఘర్షణలు అస్థిరతను మరింత తీవ్రతరం చేయడం వల్ల మరిన్ని సంఘర్షణలకు బీజాలు వేస్తాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు