కన్నా బిడ్డలను.కడతేర్చిన కర్కస తండ్రిని పోలీసులు
అమరావతి, 21 జూన్ (హి.స.) కన్నబిడ్డలను కడతేర్చిన కర్కశ తండ్రినిఎట్టకేలకుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న తన బిడ్డలు లక్ష్మీ హిరణ్య, లీలాసాయిలను కన్నతండ్రి రవిశంకర్ దారుణంగా హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి సదరు త
కన్నా బిడ్డలను.కడతేర్చిన కర్కస తండ్రిని పోలీసులు


అమరావతి, 21 జూన్ (హి.స.)

కన్నబిడ్డలను కడతేర్చిన కర్కశ తండ్రినిఎట్టకేలకుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న తన బిడ్డలు లక్ష్మీ హిరణ్య, లీలాసాయిలను కన్నతండ్రి రవిశంకర్ దారుణంగా హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి సదరు తండ్రి పరారయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రవిశంకర్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతడి కాల్ డీటెయిల్స్ లోకేషన్ ఆధారంగా రవిశంకర్‌ను గుర్తించారు పోలీసులు. దాదాపు పది రోజుల తర్వాత సింహాచలం అప్పన్న ఆలయంలో రవిశంకర్ ఉన్నట్లు గుర్తించిన మైలవరం పోలీసులు... గురువారం రాత్రి అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రెండు రోజులుగా మైలవరంలోని రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. చివరకు బిడ్డలను తానే చంపానని.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande