తెలంగాణ, వరంగల్. 21 జూన్ (హి.స.)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో యోగ పరిమళం గుబాలించింది. యోగాసనాలతో కీర్తి తోరణాల ప్రాంగణంలో ప్రాణామ్యాయం ప్రతిధ్వనించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, జిల్లా అధికార యంత్రాంగం, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో యోగా గురువు అమృతవల్లి ఆసనాలు వేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక ప్రదేశాల్లో యోగా చేయడం మన సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో అంగీకరించాలన్నారు. యోగ కేవలం వ్యాయామమే కాకుండా మన ప్రాచీన ధ్యాన సాంప్రదాయానికి నిదర్శనమని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు