హైదరాబాద్, 21 జూన్ (హి.స.)
గుజరాత్లోని అహ్మదాబాద్ () నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా (బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఇటీవల కుప్పకూలి మంటల్లో దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. కాగా.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు