హైదరాబాద్, 21 జూన్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడకలను నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాటికి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ప్రజలు భారీ స్థాయిలో హాజరయ్యారు. యోగాసానాలు ముగిసిన అనంతరం గేట్ నెంబర్ 2 వద్ద ఉచితంగా అల్పహారాన్ని పంపిణీ చేశారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా అక్కడికి పోటెత్తగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన సిబ్బంది ఆమెను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్