అమరావతి, 21 జూన్ (హి.స.)
దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ) ఘనంగా జరుపుతున్నారు. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో కూడా యోగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక, విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంతో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేస్తున్నారు .
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ