అమరావతి, 21 జూన్ (హి.స.)వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయన జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈరోజు (శనివారం) ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా జైలులో ఉన్న వైద్యులతో పరీక్షలు చేయించారు. ఆపై ముందస్తు జాగ్రత్తగా ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించారు .
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ