అమరావతి, 21 జూన్ (హి.స.)
విశాఖ: యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నాం. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. నిన్న 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారు. రోజూ గంట సేపు యోగా చేస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి.
యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయి. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించుకుంటున్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలి. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తాం.’’ అని చంద్రబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ