మహబూబాబాద్, 26 జూన్ (హి.స.)
విద్యుత్ షాక్కు గురై జూనియర్ లైన్ మెన్ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గంగారం మండలం సబ్స్టేషన్ పరిధిలోని మడగూడెం ఏరియాలో విద్యుత్ మరమ్మతు పనుల సందర్భంగా జూనియర్ లైన్ మెన్ ప్రవీణ్ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం సాయంత్రం భారీ వర్షం గాలులతో వీచడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనుల్లో ప్రవీణ్ మరమ్మతులు చేస్తుండగా అనూహ్యంగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఘాతానికి గురై ఆయన ఒంటిపై మంటలు చెలరేగి, ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్