తెలంగాణ, నిజామాబాద్. 26 జూన్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా కోటార్మూర్లోని హనుమాన్ టెంపుల్ ఏరియాలో బైక్ పై వస్తున్న వ్యక్తి మహేష్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో మహేష్ ను ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు