అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న కేంద్ర మంత్రి
రాజమహేంద్రవరం, 26 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం (Rajahmundry)లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు (Akhanda Godavari Tourism Project)కు శంకుస్థాపన జరిగింది. ఈ మహోత్తర కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న కేంద్ర మంత్రి


రాజమహేంద్రవరం, 26 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం (Rajahmundry)లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు (Akhanda Godavari Tourism Project)కు శంకుస్థాపన జరిగింది. ఈ మహోత్తర కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Minister Gajendra Singh Shekhawat) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టును రూ. 94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. దీని ద్వారా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కొత్త ఆకర్షణలను జోడించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan), రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు 2027 లో జరిగే పుష్కరాల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ శంకుస్థాపన కోసం ఈ రోజు తెల్లవారుజామున కేంద్ర మంత్రి చేరుకోగా.. విమానశ్రయంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి స్వాగతం పలికారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande