రాజమహేంద్రవరం, 26 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (Rajahmundry)లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు (Akhanda Godavari Tourism Project)కు శంకుస్థాపన జరిగింది. ఈ మహోత్తర కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Minister Gajendra Singh Shekhawat) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టును రూ. 94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. దీని ద్వారా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కొత్త ఆకర్షణలను జోడించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan), రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు 2027 లో జరిగే పుష్కరాల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ శంకుస్థాపన కోసం ఈ రోజు తెల్లవారుజామున కేంద్ర మంత్రి చేరుకోగా.. విమానశ్రయంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి స్వాగతం పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి