అర్హులైన పేదలందరికీ ఇండ్లు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ, 5 జూన్ (హి.స.) తనకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలకే నా జీవితం అంకితం అని ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక అధికారిక క్యాంప
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


నల్గొండ, 5 జూన్ (హి.స.)

తనకు పదవి ఉన్నా లేకున్నా

మునుగోడు ప్రజలకే నా జీవితం అంకితం అని ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక అధికారిక క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దశలో మంజూరైన ఇల్లు నిరుపేదలకు మంజూరి పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్ మండలాలలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరైన లబ్ధిదారులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యంతో కలిసి ఇందిరమ్మ ఇల్లుల మంజూరి పత్రాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు రాని వాళ్ళు అధైర్య పడొద్దని అర్హులైన పేద వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande