, హైదరాబాద్ 13 జూలై (హి.స.)
: పేదలకు రేషన్ పథకంలో రాష్ట్రం సరికొత్త మైలురాయికి చేరుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. జులై 14 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్కార్డుల సంఖ్య 95,56,625కి.. లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కి పెరగనుందని తెలిపారు. ఆహారభద్రతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే సభలో కొత్త కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ మేరకు శనివారం ఉత్తమ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ