శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే!
బెంగళూరు, 1 అక్టోబర్ (హి.స.) ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్గే ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవ
AICC President Mallikarjun Kharge admitted to hospital in Bengaluru


బెంగళూరు, 1 అక్టోబర్ (హి.స.)

ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్గే ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖర్గేకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. అందుకే ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

నిన్న మంగళవారం (సెప్టెంబర్ 30) మల్లికార్జున ఖర్గే యథావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఉత్తర కర్ణాటకలో జరిగిన భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని ఆయన కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి. కళ్యాణ్ కర్ణాటకలో వరదలు, పంట నష్టానికి పరిహారం అందించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరణాత్మక లేఖ రాస్తానని కూడా ఆయన చెప్పారు. మరోవైపు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కళ్యాణ కర్ణాటకలో వరద పరిస్థితిని సమీక్షించి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి, పంటలు దెబ్బతిన్న వారికి ఎలాంటి పరిహారం ఇవ్వాలో కూడా ఆయన అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande