ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసును సుమోటోగా స్వీకరించిన NCSC
ఛండీగఢ్‌, 10 అక్టోబర్ (హి.స.)హరియాణలో ఐపీఎస్ అధికారి (IPS officer) వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య (Puran Kumar suicide) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 7న ఛండీగఢ్‌లోని తన నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్
Haryana DGP Case Filed After Dalit IPS Officer Wife Alleges Role in Husband’s Suicide Haryana DG


ఛండీగఢ్‌, 10 అక్టోబర్ (హి.స.)హరియాణలో ఐపీఎస్ అధికారి (IPS officer) వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య (Puran Kumar suicide) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 7న ఛండీగఢ్‌లోని తన నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన రాసిన 8 పేజీల సూసైడ్ నోట్‌ (Suicide note)ను పోలీసులు స్వాదినం చేసుకున్నారు. డీజీపీ, ఏడీజీపీ, ఎస్పీ ర్యాంకులకు చెందిన 10 మంది సీనియర్ అధికారులు మానసిక వేధింపులకు గురిచేశారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఐపీఎస్ అధికారి తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. దళిత ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసును జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) సుమోటోగా స్వీకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande