body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
చెన్నై/ఢిల్లీ,,12అక్టోబర్ (హి.స.), తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని పెత్తాలుపట్టిలో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కోసం రసాయన పదార్థాల టిన్నులను భద్రపరిచిన గదిలో నిప్పురవ్వలు పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. పేలుడుకు ఓ గది నేలమట్టమైంది. అదే సమయంలో చుట్టుపక్కల గదుల్లో ఉంచిన టపాసులకు కూడా మంటలు వ్యాపించాయి. నలువైపులా మంటలు వ్యాపించడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం మూడు ఫైరింజన్లతో తీవ్రంగా ప్రయత్నించింది. సాయంత్రం వరకూ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. జ్ఞానవేల్ అనే వ్యక్తి నడుపుతున్న ఆ కర్మాగారంలో దీపావళిని పురస్కరించుకుని టపాసులు తయారు చేస్తున్నారు. రోజూ 50 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ