పాక్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ పరిధిలోనే
లఖ్‌నవూ/ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.) పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ పరిధిలో ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని చెప్పారు. భారత్‌కు విజయాలు అలవాటుగా మారాయని
Entire Pakistan under Brahmos radar


లఖ్‌నవూ/ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.)

పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ పరిధిలో ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని చెప్పారు. భారత్‌కు విజయాలు అలవాటుగా మారాయని చెప్పడానికి ఆ ఆపరేషన్‌ నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌నాథ్‌తో కలిసి ఆయన సరోజిని నగర్‌లో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ నుంచి తయారైన తొలి బ్రహ్మోస్‌ క్షిపణులను సైన్యానికి శనివారం అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బ్రహ్మోస్‌ ఓ క్షిపణి మాత్రమే కాదు. మన దేశ వ్యూహాత్మక ధైర్యానికి అదొక ప్రతీక. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలిగే సామర్థ్యం మన రక్షణ వ్యవస్థకు ఉంది. రక్షణ ఉత్పత్తుల్లో పెరుగుతున్న మన నమ్మకానికి, సామర్థ్యానికి ఇక్కడి బ్రహ్మోస్‌ ప్రాజెక్టు ఓ ప్రతీక. ఇక్కడి క్షిపణులను తయారు చేయడం ఒకప్పుడు కల. ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది’’ అని పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande