అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)
వనస్థలిపురం, ద్విచక్రవాహనదారుడు (ఏపీ37డీఎస్3639) 57 సార్లు రాంగ్రూట్లో వెళ్లి నిఘా కెమెరాకు చిక్కాడు. ఈ మొత్తం జరిమానా రూ.58,895లకు చేరింది. ఆదివారం ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. సాగర్ కాంప్లెక్స్ నుంచి గుర్రంగూడకు రాంగ్రూట్లో వెళ్లడంతో జరిమానా పడిందని ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ