ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నేడు కేబినెట్ సమావేశం.జరగనుంది
అమరావతి, 3 అక్టోబర్ (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దాదాపు 20 అజెండా అంశాలతో రాష్ట్ర మంత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నేడు కేబినెట్ సమావేశం.జరగనుంది


అమరావతి, 3 అక్టోబర్ (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దాదాపు 20 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం.

ఈ మేరకు ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌(లిఫ్ట్) పాలసీ 2024-29కి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులపై చర్చలు జరగనున్నాయి. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇచ్చే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande