కామారెడ్డి పట్టణంలో కత్తిపోట్ల కలకలం.. ఐదుగురికి గాయాలు
తెలంగాణ, కామారెడ్డి. 3 అక్టోబర్ (హి.స.) కామారెడ్డి పట్టణంలో గురువారం అర్థరాత్రి కత్తిపోట్లు కలకలం రేపింది. పాత బస్టాండ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గానవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారికి చివరి రోజు, దసరా పండగ కావడంతో పలు చోట్ల దాండ
కామారెడ్డి క్రైమ్


తెలంగాణ, కామారెడ్డి. 3 అక్టోబర్ (హి.స.)

కామారెడ్డి పట్టణంలో గురువారం అర్థరాత్రి కత్తిపోట్లు కలకలం రేపింది. పాత బస్టాండ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గానవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారికి చివరి రోజు, దసరా పండగ కావడంతో పలు చోట్ల దాండియా ఆడారు. దాండియా వద్ద రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. కొందరు యువకులు వెంట తెచ్చుకున్న కత్తులతో దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత చేసుకుంది. దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకులకు మెడ, పొట్ట, వీపు భాగాలలో గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పోలీసులు జీజీహెచ్ కు తరలించారు. క్షతగాత్రులను రాహుల్, మణిరాజు, మణికంఠం, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. జీజీహెచ్ ఎదుట మళ్లీ రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande