అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన తీవ్ర వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. ఒరిస్సా రాష్ట్రం గోపాలపూర్ దగ్గర వాయుగుండం తీరం దాటింది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయనిస్తూ ప్రస్తుతం క్రమంగా బలహీనపడుతోంది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలని అధికారులను ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV