బెంగళూరు ,ఢిల్లీ, ,05 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తలను పదేపదే ఆహ్వానించడం బెంగళూరును అవమానించడమేనని ఏపీ మంత్రి నారా లోకేశ్ను ఉద్దేశించి కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. కర్ణాటక, బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ లోకేశ్ ఇచ్చిన పిలుపుపై ఆయన శనివారం విలేకర్ల వద్ద స్పందించారు. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వారిని ఏపీకి ఆహ్వానించడమూ సరికాదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ