ఢిల్లీ, ,05 అక్టోబర్ (హి.స.) భారీ వర్షాల కారణంగా పశ్చిమబెంగాల్ (West Bengal) లోని డార్జిలింగ్ (Darjeeling)లో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనా స్థలాల్లో భద్రతా బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు సిలుగుడి-మరిక్ ప్రాంతాలను కలిపే బాలసోన్ నదిలోని ఇనుప వంతెన దూదియా వద్ద కుప్పకూలింది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. కలింపాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది.
717 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడడంతో సిక్కిం-సిలిగుడి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు. భూటాన్లో భారీ వర్షాలతో బెంగాల్కు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ