
అమరావతి,10 నవంబర్ (హి.స.) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) డిసెంబర్ 6వ తేదీన డాలస్లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా పదివేలమంది ప్రవాస తెలుగువారితో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వందమందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ డాలస్ సభ ఏర్పాట్లను సజావుగా నిర్వహించాలని ఓ కార్యచరణ రూపొందించారు ఎన్నారై టీడీపీ సభ్యులు. లోకేష్ సభ కోసం ఒక స్టీరింగ్ కమిటీ, వారితో అనుసంధానం చేసుకుంటూ సెక్యూరిటీ, భోజనాలు, స్వాగతసన్నాహకాలు, వేదిక ఏర్పాట్లు వంటి ఒక్కో బాధ్యతను నిర్వహించేందుకు ఇతర కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాలుపంచుకునేందుకు కొందరు సభ్యులు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ పేర్లు నమోదు చేసుకున్నారు.
సమావేశానికి హాజరు కాలేకపోయిన ఇతర సభ్యులు, కింద జత చేసిన లింక్ ద్వారా మీకు ఆసక్తి ఉన్న ఈ కమిటీల్లో వారి పేరు, కాంటాక్ట్ వివరాలు పొందుపరచవచ్చని డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు సూచించారు. ఈ క్రమంలోనే స్టీరింగ్ కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV