
తిరుమల, 16 నవంబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్, ఆదివారం సెలవు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆదివారం ఉదయానికి 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారం దర్శనం 6 గంటల్లో జరుగుతుందని టీటీడీ పేర్కొంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు, కొత్తగా క్యూ లైన్లో వెళ్లేవారికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది.
శనివారం స్వామివారిని 73,852 మంది భక్తులు దర్శించుకోగా.. స్వామివారికి 31,277 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చినట్లు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV