
అమరావతి, 20 నవంబర్ (హి.స.)
హైదరాబాద్: కల్తీ నెయ్యి వ్యవహారంలో తితిదే మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఏపీ సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను సిట్ విచారించింది. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని మరింత లోతుగా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ