
బెంగళూరు, 21 నవంబర్ (హి.స.)
బెంగళూరు ట్రాఫిక్ పై వ్యోమగామి
శుభాంశు శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులో జరిగిన టెక్ సదస్సులో శుభాంశు శుక్లా ప్రసందించారు. ఈ సందర్భంగా.. బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్షంలోకి ప్రయాణించడం చాలా తేలిక అంటూ నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా తాను షెడ్యూల్ చేసుకున్న ప్రసంగం కంటే ట్రాఫిక్ లో మూడు రెట్లు ఎక్కువ సమయం పట్టిందని అన్నారు. కాబట్టి స్పీచ్ ఇచ్చేందుకు తనకు ఉన్న నిబద్దతను గుర్తించాలని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..