
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ఉగ్ర డాక్టర్ల బృందం ఉమర్, షాహీన్, ముజమ్మిల్ కలిసి దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. టెర్రర్ మాడ్యూల్ బయటపడడంతో అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంత కుట్ర జరిగిందో వెలుగు చూసింది. ఇక మంగళవారం హర్యానా డీజీపీ ఓపీ సింగ్, కమిషనర్, డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ బృందం మంగళవారం క్యాంపస్ను సందర్శించారు. దీంతో యూనివర్సిటీలో చాలా లోపాలు కనిపించాయి. క్యాంపస్లో ఉగ్ర కుట్రలు జరుగుతున్నా.. ఎందుకు గుర్తించలేకపోయారని.. ఇందులో ఏదో మతలబు ఉందంటూ పోలీస్ అధికారుల బృందం భావించింది. ఇప్పటికే సంస్థ ఛైర్మన్ను అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల రాకతో చాలా మంది ప్రొఫెసర్లు, స్థానికులు కూడా అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అక్రమాలపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ