
సత్యసాయి జిల్లా, 22 నవంబర్ (హి.స.)
:సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పుట్టపర్తిలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేక రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఇవాళ(శనివారం) ఉదయం వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. తాజాగా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ