
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 23 నవంబర్ (హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి చాలా బాధిస్తుంది.. ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు నాకు సరిపోలడం లేదు. ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది.. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టు అర్థమవుతుంది. కానీ, దానికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతానికి నా దగ్గర లేవని వెల్లడించారు. ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాంటి మాటలే మాట్లాడతారని అనుకుంటారు.. ఎప్పటికైనా ఆధారాలు బయటకు వస్తాయని పీకే చెప్పుకొచ్చారు.
అయితే, ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి బీహార్లోని వేలాది మంది మహిళా ఓటర్లకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) డబ్బులు పంపిణీ చేసిందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 50 వేల మంది మహిళలకు రూ. 10 వేలు ఇవ్వడం కూడా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించింది అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ