
అమరావతి, 3 నవంబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}: body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}పట్నా body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}నవంబర్ 03(హి.స.)
బిహార్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ పునరుద్ఘాటించారు. ‘‘ఈ నెల 14న శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. 18న ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఆరోజు ప్రమాణ కార్యక్రమం ఉంటుంది’’ అని తెలిపారు. జనసురాజ్ పార్టీకి మద్దతిస్తున్న దులార్ చంద్ హత్యకు సంబంధించి జేడీ(యూ) అభ్యర్థి, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ అరెస్టు నేపథ్యంలో తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇవాళ ప్రధానమంత్రి బిహార్ను సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని ఆయన గమనించాలి. నేరం జరగకుండా ఒక్కరోజు కూడా గడవటంలేదు. కానీ మహాగఠ్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మార్పు వస్తుంది. కులమతాలతో సంబంధం లేకుండా ఈ నెల 26 నుంచి జనవరి 26 వరకు నేరస్థులందరినీ జైళ్లకు పంపిస్తాం. సాధ్యమైనంత కఠిన చర్యలు వారిపై తీసుకుంటాం’’ అని చెప్పారు. బిహార్ ప్రజలు ఈసారీ నీతీశ్ కుమార్పై నమ్మకం ఉంచుతారని తెలిసి విదేశాల్లో విహారయాత్రకు వెళ్లేందుకు తేజస్వి టికెట్లు కొనుగోలు చేసినట్లు తనకు తెలిసిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత రాజీవ్ ప్రతాప్ రూడీ ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ