
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 03 (హి.స.)జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో కేబుల్ కార్ ప్రాజెక్టు చేపట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐయే) ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి తెలిపింది. ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడిలో పహల్గాంలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దానిపై దర్యాప్తును ఎన్ఐయే చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ఆ సంస్థ ఆమోదాన్ని ప్రభుత్వం కోరింది. 1.4 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు.. పహల్గాంలోని యాత్రీనివాస్ వద్ద మొదలై, ఎగువన బైసరన్ వద్ద ముగుస్తుంది. ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులు 18 నెలల్లో పూర్తవుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ