
అమరావతి, 30 నవంబర్ (హి.స.)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’(mana Shankara Varaprasad gaaru). ‘సంక్రాంతి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. అలాగే వీటీవీ గణేష్, కేథరిన్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేయడంతో పాటు టాప్లో కొనసాగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్లోకి రాబోతుంది.
ఈనేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ‘‘ఈ సంక్రాంతికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం. చిరంజీవిని మనం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయనకు ఎంతో నచ్చిన జానర్. ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన ఈ జానర్తో రానున్నారు. గతంలో ఇలాంటి జానర్లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాతో చిరంజీవి అభిమానులను సర్ప్రైజ్ చేయబోతున్నారు. ‘మీసాల పిల్ల’ సాంగ్ మేము ఊహించని రెస్పాన్స్ను దక్కించుకుంది. త్వరలోనే ఇంకోపాటను కూడా విడుదల చేస్తాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV