బీహార్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే.
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
బీహార్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే.


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ నవంబర్ 06( హి.స.)

బీహార్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.

ఇక తొలి విడతలో భాగంగా పలువురు ప్రముఖులు ఓట్లు వేశారు. కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ ఓటు వేయగా.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తన భార్యతో కలిసి హాజీపూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇక ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన కుటుంబంతో కలిసి పాట్నాలో ఓటు వేశారు. అలాగే డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ కూడా తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి, విద్య, మంచి ఆరోగ్య సంరక్షణ కోసం ఓటు వేయాలని కోరారు. బీహార్ ప్రజలు వర్తమానం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande