పత్తి రైతుల సమస్యల పై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు. లేఖ రాసారు మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, 6 నవంబర్ (హి.స.) : పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు
పత్తి రైతుల సమస్యల పై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు. లేఖ రాసారు మంత్రి అచ్చెన్నాయుడు


అమరావతి, 6 నవంబర్ (హి.స.)

: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు. రైతులు ప్రస్తుతం కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే CM APP మరియు ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన Kapas Kisan App ను రాష్ట్ర CM APP తో అనుసంధానం చేసిన తరువాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతుల వివరాలు Kapas Kisan App నుండి CM APP కు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande