
అమరావతి, 6 నవంబర్ (హి.స.) కావలి రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నేడు మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గంలోని దగదర్తికి పర్యటనకు రానున్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, ఈ పర్యటన వెనుక రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కావలి టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు లోకేష్ పుల్స్టాప్ పెట్టబోతున్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో మాలేపాటి వర్గం మరియు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుచరుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. మాలేపాటి ఉత్తరక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన కావ్యను ఆ వర్గం అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన వాగ్వాదం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ