
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 06( హి.స.)
బీహార్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా.. మొదటి విడతగా 121 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తొలి విడత పోలింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ బీహార్ యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బీహార్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే బీహార్ పోలింగ్కు ఒక రోజు ముందు బుధవారం రాహుల్గాంధీ ‘‘ఓట్ చోరీ’’ కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో పెద్ద ఎత్తున ఓట్ల దొంతనం జరిగిందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్క్రీన్పై వేసి చూపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ