
జమ్మూ, 8 నవంబర్ (హి.స.)
కుప్వారాలోని కేరన్ సెక్టార్లో చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పక్కా నిఘా సమాచారం మేరకు నవంబర్ 7న సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించాయి. అనంతరం దళాలు ఆపరేషన్ను ప్రారంభించాయి. దీంతో ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. మరొక ఉగ్రవాది నక్కి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన దగ్గర నుంచి సైన్యం నిఘా పెంచింది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు